* దివ్యాంగులకు మందుల పంపిణీ
* దివ్యాంగులకు ఐఎంఏ ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ
* నిర్వహించిన నంద్యాల ఐఎంఏ, దివ్యాంగుల జిల్లా సంక్షేమ సంఘం
నంద్యాల : రాష్ట్ర మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ 75వ జన్మదినోత్సవం పురస్కరించుకుని సంఘం కార్యాలయంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ సౌజన్యంతో దివ్యాంగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ, కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అతిథులుగా పాల్గొని 20 మంది దివ్యాంగులకు 15వేల రూపాయల విలువ చేసే నెలవారి మందులను అందజేశారు. ఐఎంఏ నంద్యాల, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్తంగా గత 15 సంవత్సరాలుగా దివ్యాంగులకు అందజేస్తున్న ఉచిత ఓపి హెల్త్ కార్డులను ఫరూక్ జన్మదినోత్సవం సందర్భంగా పదిమంది దివ్యాంగులకు కొత్త కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ ,డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ మంత్రి ఫరూక్ గత 40 సంవత్సరాలుగా పురపాలక, ఆరోగ్య, విద్యా, చక్కెర శాఖల మంత్రిగా,ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా నంద్యాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు.సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ప్రభుత్వ కళాశాలకు నూతన భవనాలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పడకల సంఖ్య పెంపు, ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం, ఎన్టీఆర్ టౌన్ హాల్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని,నంద్యాల అభివృద్ధిలో వారి కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. మంత్రి ఫరూక్ భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని నంద్యాల ఐఎంఏ, కళారాధన,నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం,నంద్యాల జిల్లా చిన్న,వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం,లయన్స్ క్లబ్, క్రీడా సంఘాల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య ప్రధాన కార్యదర్శి రామలింగం, జిల్లా సంఘం కార్యవర్గ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Leave a Reply