నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి NMD ఫరూక్ మనవడు నశ్యం ఫైజ్, తన అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ బాడ్మింటన్ సింగిల్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణంగా మారాడు.నశ్యం ఫైజ్ చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన ఫైజ్ విజయానికి పునాది – అతని కృషి, నిబద్ధత మరియు అతని పట్టుదల మాత్రమే. బాడ్మింటన్ ఆటపట్ల అంకితభావంతో పాటు, కుటుంబం నుంచి వచ్చిన విలువలు, ప్రోత్సాహం ఈ విజయానికి తోడ్పడిన ముఖ్య కారణాలు ఈ సందర్భంగా నశ్యం ఫైజ్ మాట్లాడుతూ “నా తాతయ్య NMD ఫరూక్ నాకు స్పూర్తి. వారి ఆశీస్సులే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇది నా జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి మాత్రమే కాదు ఇంకా ఎన్నో విజయాలు సాధించి భారతదేశాన్ని గర్వపడేలా చేయాలన్నదే నా లక్ష్యం,” అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి NMD ఫరూక్ మాట్లాడుతూ “నా మనవడు దేశానికి గర్వకారణంగా మారడం, కేవలం మా కుటుంబానికి కాదు – రాష్ట్రానికే గౌరవం. అతని విజయాల్లో తల్లిదండ్రుల మార్గదర్శనం, గురువుల శ్రమ, సమాజం యొక్క ప్రోత్సాహం ఉన్నాయి,” అని ఆనందం వ్యక్తం చేశారు.శ్రద్ధ, సమయపాలన, మరియు ఆటపట్ల ప్రేమ – ఇవన్నీ కలిసే నశ్యం ఫైజ్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని ఈ విజయం కొత్తతరం క్రీడాకారులకు ఒక గొప్ప స్పూర్తిగా నిలుస్తుందన్నారు.ఈ విజయంతో, నశ్యం ఫైజ్ క్రీడా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా, భారత యువతకు ఆశాజ్యోతి గా నిలిచాడు.
Leave a Reply