2025 ఉత్తమ  సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ( పి జి  ) విద్యార్థికి బంగారు పతకం అందజేత

Oplus_131072

నంద్యాల : పట్టణ సమీపంలోని  శాంతిరాం మెడికల్ కాలేజ్‌ మానసిక వైద్యశాఖ అధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎస్.మూర్తి   2025 సంవత్సరం నుండి ఉత్తమ  సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ( పి జి  ) విద్యార్థిలకు ప్రతి సంవత్సరం బంగారు పతకాన్ని ప్రదానం చేయడానికి ఒక ప్రోత్సాహక పతకాన్ని స్థాపించారు.2025 సంవత్సరం కి గాను డా. పి.ప్రజ్ఞా  అనే సైకియాట్రీ  పి జి   విద్యార్థికి డా.పి.ఎస్.మూర్తి మెడల్ అందజేశారు. తదుపరి 20 సంవత్సరాలపాటు ఈ బంగారు పతకాన్ని వార్షికంగా అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాంతిరాం సంస్థల ఛైర్మన్ మరియు శాంతిరాం మెడికల్ కాలేజ్ & జనరల్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ ఎం.శాంతిరాముడు  హాజరై, ఉత్తమ పి జి  విద్యార్థికి బంగారు పతకాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో శాంతిరాం మెడికల్ కాలేజ్ వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎం.మాధవీలత , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘురామ్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిబాబు, ప్రిన్సిపాల్ , మెడికల్ సూపరింటెండెంట్, ఆర్ . యం.ఓ మానసిక వైద్య విభాగం అధ్యాపకులు, పీజీ విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this