కర్నూలు : దాసరి బేబీ అనే ఓ 40 సంవత్సరాల మహిళ జొన్నగిరి డోన్ మండలం నివాసం ప్రస్తుతం చైతన్య కాలేజీలో స్వీపర్గా పనిచేస్తుంది. ఆమె భర్త లేడు కష్టపడి బతుకుతున్న ఆమెకు అకస్మాత్తుగా ఓ కష్టం వచ్చింది విపరీతమైన దగ్గు ఊపిరి ఆడేది కాదు. ఆమె ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలుకు గుండె ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స విభాగానికి రెఫర్ చేసారు.ఆమెను పరీక్షలు చేయగా ఆమె ఛాతిలో పెద్ద గడ్డ ఉన్నట్లు గుర్తించాం.. అది ఎంత పెద్దగా ఉంది అంటే ఎడమవైపు ఛాతినంతా ఆక్రమించి గుండెను కూడా కుడివైపుకు తోసేసింది.రక్తనాళాలను వాయునాళాన్ని కూడా గట్టిగా ఒత్తేస్తుంది దాని వలన ఆమెకు సమస్యలు వచ్చాయి.ఈమెకు ఎక్స్రే, సిటీ స్కాను, ఎమ్మారై లాంటి పరీక్షలు చేసి జాగ్రత్తగా ఆపరేషన్ చేయాలి అని నిర్ణయించాము. కానీ అంత పెద్ద గడ్డను ఎలా తీయగలమో ఏమైనా సమస్య వస్తుందా అని కొంచెం ముందు వెనక ఆలోచించి పేషంట్ కు ధైర్యం చెప్పి ఆపరేషన్ చేయడానికి పూనుకున్నాము.. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన ఆపరేషన్ మరియు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లేకి ఈమె స్తోమత సరిపోదు.. ఇది ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా కొంత డబ్బుతో చేయవచ్చు.22/4/25 న ఈమెకు ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేసి గడ్డను పూర్తిగా తొలగించడం జరిగింది. పేషెంట్ కొంచెం రికవరీ కష్టమైనా కానీ బాగా కోలుకొని డిశ్చార్జ్ చేయడానికి రెడీ అయింది.ఎన్టీఆర్ వైద్య సేవ అనే ఈ పథకం చాలా మంది పేదలకు ఉపయోగపడుతూ ఉంటుంది.దీనివలన ప్రభుత్వ సరోజన వైద్యశాల కర్నూల్ లో ప్రతి నెల 15 మంది దాకా పెద్ద బైపాస్ ఆపరేషన్లు చేపించుకొని సంతోషంగా ఇళ్లకు వెళుతూ ఉంటారు. ఆమెకు ఎటువంటి సమస్య లేకుండా కలకాలం బాగా జీవించాలని మనం కోరుకుందాం.. ఈ సదుపాయాలు అత్యాధునికమైన వైద్య సదుపాయాలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సిటివిఎస్ విభాగంలో కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Leave a Reply