ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన

విజయవాడ : ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ సింగపూర్ లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి.గణేష్ మణిరత్నం, అలాగే ఇండివిడ్యువల్, మిక్సిడ్, టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి.షణ్ముఖి నాగసాయి విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్చరీలో వారు సాధించిన పతకాలు, విజయాలు గురించి వివరించారు. సందర్భంగా వారిని శాప్ ఛైర్మన్ అభినందించడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని విస్తృతం చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఆర్చరీ కోచ్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Share this