చదువుతూనే “ఉజ్వల భవిష్యత్తు”

Oplus_131072

* ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ కుమార్ శర్మ

*  యువ స్పందన “స్టడీ సర్కిల్” ప్రారంభం

పత్తికొండ : నిరుద్యోగులు ఇష్టంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హైదరాబాద్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ శర్మ, రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ సింగరి శివయ్య అన్నారు. పత్తికొండ పట్టణంలోని పాతపేటలో ఉన్న శ్రీరాముల దేవాలయం పక్కన యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో “స్టడీ సర్కిల్” ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ కుమార్ శర్మ, రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ సింగరి శివయ్య, ఎంఈఓ రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ వీరేశప్ప, ఎస్బిఐ మేనేజర్ జానకి రామయ్య, హెచ్ఎం బాబురావు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి  స్టడీ సర్కిల్ ప్రారంభించి, స్టడీ హల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలకు వేలు ఖర్చు చేసి దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునెందుకు నిరుద్యోగులు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం పత్తికొండ యువ స్పందన సొసైటీ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల తరపున నిరుద్యోగుల కోసం యువ స్పందన సొసైటీ చేస్తున్న వివిధ కార్యక్రమాలకు తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. నిరుద్యోగులు యువ స్పందన స్టడీ సర్కిల్ ను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రజలకు ఉపయోగపడాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువాలు, మెమంటో లతో యువ స్పందన సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, సహాయ కార్యదర్శి గిరీష్, పూర్వ విద్యార్థులు రమేష్, నవాబ్, దేవేంద్రప్ప, భాస్కర్ రావు, గోవిందరాజులు, సుధాకర్, మారుతీ, సభ్యులు దాదా, మధు, హరి, శీను, మల్లికార్జున, నరేష్, రాజేశ్వరి, రాజేష్, చిన్న, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Share this