నంద్యాల జిల్లా/ గడివేముల : కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ సరుకులు పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా డీలర్లు పనిచేయాలని టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి రేషన్ డీలర్లకు సూచించారు. ఆదివారం ఆయన మాజీ జెడ్పిటిసి గడివేముల మాజీ సర్పంచ్ సీతారామి రెడ్డి, మూల పెద్దమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దేశం రమణారెడ్డి తో కలిసి గడివేములలో రేషన్ షాపులను పునః ప్రారంభించారు. ఇక లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న ఏ రేషన్ షాపు నుంచి అయినా సరుకు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రేషన్ దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రతినెల ఒకటవ తేది నుంచి 15వ తేదీలోపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయన్నారు. తూకల్లో వ్యత్యాసం, సరుకులు లేవని తిప్పి పంపడం లాంటివి చేయవద్దని రేషన్ డీలర్లకు సూచించారు. అలాగే దర్వేశి గ్రామంలో పాణ్యం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు అంగజాల కృష్ణ యాదవ్, తిరుపాడు గ్రామంలో టిడిపి నాయకుడు గిరిబాబు, గడిగరేవుల గ్రామంలో టిడిపి నాయకుడు కంది శ్రీనివాసులు, బిలకల గూడూరు గ్రామంలో మాజీ సర్పంచ్ టిడిపి సీనియర్ నాయకుడు రఫీక్ తోపాటు ఆయాగ్రామాలలో గ్రామాల టిడిపి నాయకులు రేషన్ షాపులను పునః ప్రారంభించారు.
ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాడీలర్లుపనిచేయాలి – టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి

Leave a Reply