నేటి నుంచి గ్రంథాలయంలో సమ్మర్ ఓరియంటేషన్ కార్యక్రమం

గడివేముల ఏప్రిల్ 27( ప్రజా పవర్)  : నేటి నుంచి గడివేముల గ్రంథాలయంలో పిల్లల కోసం సమ్మర్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలను గ్రంధాలయానికి పంపితే పుస్తక పఠనం అలవాటు అవుతుందని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. గ్రంథాలయంలో అనుభవ ఉపాధ్యాయులతో పిల్లలకు నీతి వాక్యాలు బోధించడంతోపాటు చదరంగం, క్యారం బోర్డు, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన పిల్లలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈనెల 28 నుంచి మే నెల ఆరవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల వరకు సమ్మర్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

Share this