గడివేముల : ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం అధిక మార్కులు సాధించిన కు రువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు కురువ సంఘం ఆధ్వర్యంలో నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు కురువ సంఘం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాపారాయుడు తెలిపారు. గురువారం అయన గడివేములలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించిన వారికి, ప్రైవేట్ పాఠశాలల్లో 550 పైగా మార్కులు సాధించిన వారికి నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన ఇంటర్ విద్యార్థులు 850 మార్కులు, ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులు 900 మార్కులు పైగా సాధించిన విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నగదు పారితోషికం అందజేయడంతో విద్యార్థులలో ఉత్సాహం కలుగుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు మార్కుల మెమోతో పాటు కులం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను ఈనెల 5వ తేదీ లోపల 9440756199, 9032741194 నెంబర్లకు వాట్స్అప్ ద్వారా పంపాలన్నారు.
కురువ విద్యార్థులకు నగదు పారితోషకం – కురువ సంఘం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాపారాయుడు

Leave a Reply