పత్తికొండ : స్థానిక పట్టణంలోని టిడిపి కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని శివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు . అనంతరం ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికుల మధ్యన కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి టిడిపి పార్టీ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. అలాంటి మహానుభావుడు అడుగుజాడల్లో మనమందరం నడవాలన్నారు. చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని భారత దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తాడన్నారు. ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మధ్యాహ్నం అన్నదానం ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము దీపిక ,నియోజకవర్గ ముఖ్య నాయకులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్

Leave a Reply