పత్తికొండ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 11 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 7 లక్షల 18 వేల రూపాయలు మంజూరు చేశారు. అందుకు సంబంధించిన చెక్కులనుపత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ కష్టకాలంలో కుటుంబానికి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్

Leave a Reply