డాక్టర్ రవికృష్ణ ను సత్కరించిన గురు రాజా విద్యా సంస్థలు

* కళలను మరింత ప్రోత్సహిస్తాం: డాక్టర్ రవి కృష్ణ

నంద్యాల : ఏప్రిల్ 16వ తేదీ, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం 177 వ జయంతి రోజున ప్రభుత్వం నిర్వహించే తెలుగు నాటక రంగ దినోత్సవంలో, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్రస్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగ స్థల పురస్కారం అందుకున్న డాక్టర్ రవి కృష్ణను గురు రాజా విద్యాసంస్థల తరపున డైరెక్టర్లు మౌలాలి రెడ్డి,షేక్షావలి రెడ్డి శాలువా, పూలమాల,జ్ఞాపిక తో సత్కరించి అభినందించారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తన దర్శకత్వంలో కళారాధన, గురురాజా స్కూల్ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో వరుసగా ఏడు సంవత్సరాలు బాలల సాంఘిక నాటికల విభాగంలో రెండు బంగారు, రెండు వెండి, రెండు కాంస్య నంది అవార్డులు అందుకోవడం జరిగిందని, రాష్ట్రంలో ఇటువంటి ఘనత సాధించిన ఏకైక సంస్థ కళారాధన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్.మధుసూదన రెడ్డి, లయన్స్ క్లబ్ నాయకులు మనోహర్ రెడ్డి శివకుమార్ రెడ్డి, విద్యా సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this