వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రైడ్లు పంపిణీ

ప్రజాపవర్ నంద్యాల టౌన్ మే 8 : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా గురువారం పండ్లు, బ్రైడ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మండల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు శీను డిఎఫ్ఓ సమీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రెడ్ క్రాస్ ఫౌండర్ జాన్ హెన్రీ దున్యాంట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిసి హెచ్ ఎస్ డాక్టర్ జఫ్రుల్లా మాట్లాడుతూ ఆపత్కాల సమయంలో అన్నివేళలా ముందుండేది రెడ్ క్రాస్ సొసైటీ అని పేర్కొన్నారు. ఐటీవల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పేదలకు సేవ చేయడం శుభ పరిణామమని, రెడ్ క్రాస్ సేవలను అభినందించారు.

Share this