ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో  ఆనర్గళంగా మాట్లాడేలన్నదే తన లక్ష్యం విల్ 2 కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్  సంస్థ డైరెక్టర్ ఏ. రామేశ్వర్ గౌడ్

Oplus_131072

నంద్యాల :  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా చేయాలన్నదే తన లక్ష్యమని విల్ 2 కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్  సంస్థ డైరెక్టర్ ఏ. రామేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.గురువారం  వైయస్సార్ సెంటినరీ హాల్, స్పందన హాల్ కలెక్టరేట్ కార్యాలయంలో  600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్లభాష నైపుణ్యాలపై ఆయన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో 53,000 మంది ఉపాధ్యాయులకు ఏపీలో 10,000 మంది ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారని తెలిపారు.

ప్రస్తుతం నంద్యాల జిల్లాకు చెందిన 1800 మందికి శిక్షణ ఇస్తున్నానని తెలిపారు. ఉపాధ్యాయులకు ఆంగ్లభాష నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడం ద్వారా వారు విద్యార్థులకు నేర్పిస్తారని ఉద్దేశంతో పూర్తి ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. రోజుకు గంట పాటు మొత్తం 40 రోజులు ఆన్లైన్ శిక్షణ ఉంటుందని ఒక రోజు మాత్రం ప్రత్యక్ష శిక్షణ ఇస్తామన్నారు.40 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్న వారికి ఆంగ్లంలో  ధారాళంగా మాట్లాడే నైపుణ్యాలు వస్తాయన్నారు. శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి పలు వీడియోలను విలువైన సమాచారాన్ని, కొన్ని సూత్రాల చార్టులను అందజేస్తామని తెలిపారు. శిక్షణ పొందిన తర్వాత కూడా కొంత సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్లం రాక అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో తాను ఈ శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వపాఠశాల ఉపాద్యాయులు 9000102166( యూనస్ భాష సమగ్ర శిక్ష అసిస్టెంట్ ఏఎమ్ఓ  ఉర్దూ) కు ఫోన్ చేసి ఉచితంగా లింకు పొందవచ్చునని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా ఉచిత శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినందుకు చాలా సంతోషం అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఉచితంగా గురువులకు శిక్షణ ఇవ్వాలని రామేశ్వర్ గౌడ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, వీరి ఆంగ్ల బోధనా విధానం ఆకట్టుకునేలా సులభంగా నేర్చుకునే విధంగా ఉందని నంద్యాల డీఈవో జనార్దన్ రెడ్డి తెలిపారు. వీరితో పాటు సమగ్ర శిక్ష ఏ పి సి  ప్రేమంత్ కుమార్ , డి వి ఎం ఎ పి  టూరిజం శ్రీ లక్ష్మీ నారాయణ  పాల్గొన్నారు

Share this