నంద్యాల : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా చేయాలన్నదే తన లక్ష్యమని విల్ 2 కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సంస్థ డైరెక్టర్ ఏ. రామేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.గురువారం వైయస్సార్ సెంటినరీ హాల్, స్పందన హాల్ కలెక్టరేట్ కార్యాలయంలో 600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్లభాష నైపుణ్యాలపై ఆయన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో 53,000 మంది ఉపాధ్యాయులకు ఏపీలో 10,000 మంది ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఉచితంగా గురువులకు శిక్షణ ఇవ్వాలని రామేశ్వర్ గౌడ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, వీరి ఆంగ్ల బోధనా విధానం ఆకట్టుకునేలా సులభంగా నేర్చుకునే విధంగా ఉందని నంద్యాల డీఈవో జనార్దన్ రెడ్డి తెలిపారు. వీరితో పాటు సమగ్ర శిక్ష ఏ పి సి ప్రేమంత్ కుమార్ , డి వి ఎం ఎ పి టూరిజం శ్రీ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు
Leave a Reply