కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నరహరి విశ్వనాధ్ రెడ్డి నియామకం

* ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిలకు ధన్యవాదములు తెలిపిన నరహరి విశ్వనాధ్ రెడ్డి

 నంద్యాల  :  విధేయులకు, అనుచరులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిలు భరోసా ఇస్తారన్న వాటికీ నరహరి విశ్వనాధ్ రెడ్డికీ కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి రావడమే నిదర్శనం.ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున నంద్యాల అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం పని చేసిన టీడీపీ యువనేత, మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథరెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ నుంచి   కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.శనివారం జారీ చేసిన ఉత్తర్వులు లలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫార్సు మేరకు ఈ కీలకమైన పదవి లభించినట్లు తెలిపారు.

నరహరి విశ్వనాథరెడ్డి తెలుగు దేశంలో వివిధ పదవులతో పాటు నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా పని చేశారు. గత ఎన్నికలలో మంత్రి ఎన్ ఎం డి ఫరూక్,  బైరెడ్డి శబరిల విజయం కోసం  కృషి చేశారు. నంద్యాల జిల్లా లో  మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య వర్గీయుడుగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ కార్యాలయం ఇంచార్జి గా  పనిచేస్తున్నారు.  విశ్వనాధ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎంపి డాక్టర్ బైరెడ్డి  శబరమ్మకు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లకు ధన్యవాదములు తెలుపు తున్నానన్నారు. నాకు లభించిన పదవి కి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  నరహరి విశ్వనాధ్ రెడ్డి కి కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం పట్ల నంద్యాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బైరెడ్డి అభిమానులు హార్షం వ్యక్తం చేసి మిఠాయిలు పంచిపెట్టారు.

Share this