ప్రజాపవర్ వెలుగోడు : రైతుల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వం ధ్యేయం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రేగడగూడూరు గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రబీలో పండించిన జొన్నలకు సరైన మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రహించి జిల్లాకు చెందిన మంత్రులు ఎన్.ఎం.డి ఫరూక్, బిసి జనార్ధన్ రెడ్డి, జిల్లా శాసన సభ్యులతో కలిసి తాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ని కలిసి జొన్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మద్దత్తు ధరను పెంచాలని విజ్ఞప్తి చేయడంతో స్పందించి క్వింటాళ్లకు రూ.3,371/- పెంచి కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. రైతుల ఇక్కట్లను గుర్తించి తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు కి, మంత్రి అచ్చం నాయుడు కి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Leave a Reply