గిరిజనుల అభ్యున్నతికి కమిషన్ కృషి : రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు

విజయనగరం :గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు తెలిపారు.షెడ్యూల్ ప్రాంతాల్లో భూములపై గిరిజనులకే హక్కులు దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ సంస్థ ప్రతినిధులు,అజయ్ కుమార్, తిరుమల రావు,గోపాల రావు,చందర్ రావు రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు కు  వినతిపత్రం అందజేసారు. విజయనగరం లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం వారు కమిషన్ చైర్మన్ కలిసారు.గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం  చేసిన చట్టాలు అమలయ్యేలా చూడాలని వారు  వినతిపత్రం లో కోరారు. సీతంపేట ఐటిడిఎ పరిధిలో  గిరిజన భూ సమస్యలను చైర్మన్ దృష్టి కి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కమిషన్  కృషి చేస్తోందని  తెలిపారు.గిరిజన ప్రాంతవాసుల సమస్యలు కమిషన్ దృష్టిలో వున్నాయని, సంబంధిత చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని కమిషన్ కోరుతుందని తెలిపారు.

Share this