జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

* గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రవి కృష్ణ.

* అధ్యక్షులుగా ఎం.పీ.వి. రమణయ్య, ప్రధాన కార్యదర్శి రామలింగం

* దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర కృషి చేస్తాం: డాక్టర్ రవి కృష్ణ

ప్రజాపవర్ నంద్యాల మే 4 : జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో గౌరవాధ్యక్షులుగా డాక్టర్ గుర్రాల రవికృష్ణ,గౌరవ సలహాదారుగా వెదుర్ల రామచంద్రరావు,అధ్యక్షులుగా ఎం.పీ.వి. రమణయ్య,ప్రధాన కార్యదర్శిగా రామలింగం, కోశాధికారిగా రామకృష్ణ, సలహా మండలి సభ్యులుగా డాక్టర్ మధుసూదనరావు,ఏ.వి.ఆర్. ప్రసాద్,లాలి స్వామి, షేక్షావలి రెడ్డి,ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా హనీఫ్ ఖాన్, ఉపాధ్యక్షులుగా సుబ్బారెడ్డి, వెంకటరావు, ఆవుకు రంగడు, రంగస్వామి సంయుక్త కార్యదర్శులుగా ఇంతియాజ్,మధు కుమార్, వీరభరతుడు,మహిళా విభాగం కన్వీనర్ గా కళ్యాణి, ఉద్యోగస్తుల విభాగం కన్వీనర్ గా రామ కిషోర్ వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా చలపతి,శ్రీనివాసులు, దుర్గారావు,కిరణ్ కుమార్,నబిరసూల్ లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యవర్గ సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేలకు పెంచినందుకు,దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగ విద్యా అవకాశాలలో స్పోర్ట్స్ కోటాలో చేర్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.అర్హత ఉన్న దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఇంటి స్థలాలు,ఇండ్లు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థలు తమ బడ్జెట్ లో విధిగా ఐదు శాతం దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలలో దివ్యాంగుల సౌకర్యం కోసం రాంపులు ఏర్పాటు చేయాలని, అంత్యోదయ కార్డులు అర్హత కలిగిన దివ్యాంగులకు మంజూరు చేయాలని, దివ్యాంగుల స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని, దివ్యాంగులలో అవసరమైన వారికి మూడు చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు ఇతర ఉపకరణాలు అందజేయాలని కోరారు. కేంద్ర దివ్యాంగుల రక్షణ చట్టంపై పోలీసు మరియు ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం అవగాహన కల్పించి దివ్యాంగుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల హక్కులు, రక్షణ చట్టం పై అవగాహన పెంచడానికి త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినెల అవసరమైన వారికి మందుల పంపిణీ, ప్రత్యేక ఉపకరణాలు అందజేయడం వంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తా మన్నారు. దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కోసం నంద్యాల బాలాజీ కాంప్లెక్ లో ఉన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. జిల్లా కార్యవర్గ సమావేశాలు తరచు నిర్వహించి దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో దివ్యాంగులు, జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Share this