తిరుపతి : మే 8,9, తేదీల్లో ఈ-వేలం ద్వారా తుడా టవర్స్ వాణిజ్య గదుల విక్రయాన్ని క్రమపద్ధతిలో నిర్వహించాలని తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ ను శనివారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతిలోని అన్నమయ్య కూడలి వద్ద 3.60 ఎకరాల స్థలంలో G+13 అంతస్తులతో ప్రతిష్టాత్మకంగా “తుడా టవర్స్” నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో నివాసయోగ్యమైన గదులకు ఈ-వేలం నిర్వహించి విక్రయించడం జరిగిందని తెలిపారు. తుడా టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ (10 గదులు), మొదటి అంతస్తు (21 గదులు)లోని వాణిజ్య గదులను మే 8, 9 తేదిలలో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నామని అన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వాణిజ్యపు గదులు 2000 నుండి 9000 చదరపు అడుగుల విస్తీర్ణముతో నగర వాణిజ్య సముదాయములకు అత్యంత అనువైనదిగా నిర్మించమని అన్నారు. వివరముల కొరకు తుడా కార్యాలయము, తుడా టవర్స్ వెబ్సైట్లు www.tudatowers.in/www.tudaap.in సంప్రదించాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈ.ఈ.రవీంద్ర, డి.ఈ. భాషా, తదితరులు ఉన్నారు.
తుడా టవర్స్ వాణిజ్య గదుల వేలం క్రమపద్ధతిలో నిర్వహించండి ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య

Leave a Reply