* ఈతకని వెళ్లి మృత్యు ఒడిలోకి చేరిన మణిధర్
* శోకసంద్రంలో మృతుని తల్లిదండ్రులు బంధువులు
నంద్యాల జిల్లా బేతంచెర్ల : మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి స్వామి ఆలయంలో ఉన్న గుండంలో మణిధర్ ( 14 ) శనివారం ఈతకని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళాడు. వివరాల్లోకెళ్తే మండల పరిధిలోని అంబాపురం గ్రామానికిచెందిన జూలకంటి రామాంజనేయులు పుల్లమ్మ కుమారుడు మృతుడు మాణిధర్ తన మేనమామ పిల్లల పుట్టు వెంట్రుకలు తీస్తుండగా, ఆ వేడుకలకు మణిధర్ హాజరై , సరదాగా ఆలయంలో ఉన్న పెద్దగుండంలో ఈతకు అని వెళ్లి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో మృతుని తల్లిదండ్రులు ,కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.గుండంలో గజఈతగాళ్ళు సహాయంతో గుండంలో వెతికించారు. చాలాసేపటి వరకు బాలుడు మృతదేహం దొరకలేద. సాయంత్రానికి గుండంలో బాలుని మృతదేహం దొరికింది. పోలీసులు మృత దేహాన్ని బనగానపల్లె లోని ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చారీ తరలించారు.ఏదేమైనా ఆలయంలో ఉన్న గుండంలో ఎవ్వరూ ఈతకు వెళ్లకుండా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు,భక్తాదులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Leave a Reply