నంద్యాల : స్థానిక పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి గా ఎస్ వెంకట రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. క్యాటగిరి 2 అధికారిగా డోన్, గుంతకల్, గుత్తి , తాడిపత్రి , హిందూపురం , పులివెందల పనిచేశారు. పదోన్నతి పై ఆయన డోన్ మున్సిపల్ కార్యాలయం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారి అంజనేయులు మార్కాపురం కు బదిలీ అయ్యారు.మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్నిఅందజేశారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ ను కలిశారు. అర్ఓ వెంట శానిటేషన్ సూపరైజర్ లక్ష్మినారాయణ ఉన్నారు.
రెవిన్యూ అధికారి గా ఎస్ వెంకట రెడ్డి బాధ్యతల స్వీకరణ

Leave a Reply