గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్

నంద్యాల : స్థానిక పట్టణంలోని ఎన్జీవో కాలనీ నందుగల శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎస్.ఎస్.సి 2025 నందు 597 మార్కులతో స్టేట్ లెవెల్ టాపర్ గా నిలిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు పోస్టర్ ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణలో స్కూల్ డైరెక్టర్ పి షేక్షావలి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్టేట్ లెవెల్ లో 597 మార్కులతో పాటు 590 మార్కులకు పైగా 6 మంది విద్యార్థులు సాధించడం విశేషమని  తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని మంత్రి ఎన్ఎండి ఫరూక్  తెలిపారు. మంత్రి  విద్యార్థుల విజయాలను ప్రశంసించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని పాఠశాల డైరెక్టర్ షేక్షావలి రెడ్డి సన్మానించారు.

Share this