* లయన్ పెసల శ్రీకాంత్ కు మల్టిపుల్ రాష్ట్ర అవార్డు
ప్రజాపవర్ నంద్యాల మే 5: జిల్లా కేంద్రంలోని సర్వజన వైద్యశాలకు వచ్చే వందలాదిమంది రోగుల సహాయకులకు సేవా దృక్పథంతో ప్రతిరోజు మధ్యాహ్నం,రాత్రి భోజనం వసతి కల్పిస్తున్న నంద్యాల సేవా ప్రగతి లయన్స్ క్లబ్ కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు దక్కాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ క్లబ్ ల సమాఖ్య చైర్ పర్సన్ డి శాంతి ఆధ్వర్యంలో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ (316) 9వ మల్టిపుల్ కన్వెన్షన్ అడబాల గార్డెన్స్ లో ఈనెల 2,3, 4వ తేదీల్లో అట్టహాసంగా నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుంచి లయన్స్ సభ్యులు, లయన్స్ నాయకులు ,అంతర్జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. పాలకొల్లు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను అభినందించారు.చివరి రోజు మల్టిపుల్ అవార్డు 2023-24,2024 – 25 సంవత్సరాలకు ఉత్తమ సేవ క్లబ్ లు, ఉత్తమ సేవా ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ప్రకటించి అందజేశారు. ఇందులో లయన్ ఆఫ్ ది మల్టిపుల్ అవార్డు 2023 – 24 అవార్డు లయన్ పీఎంజేఫ్ పెసల శ్రీకాంత్ కు నంద్యాల సేవా ప్రగతి లయన్స్ క్లబ్ కు దక్కింది.బెస్ట్ రిలీవింగ్ ది హంగర్ ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నంద్యాల సేవా ప్రగతి లైన్స్ క్లబ్ కు అభినందిస్తూ అవార్డ్ అందజేశారు. అప్పటి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ చేతుల మీదగా అవార్డు ను అందజేశారు. బెస్ట్ జి ఎల్ టి కోఆర్డినేటర్ 2024-25 ఆఫ్ మల్టీపుల్ డిస్ట్రిక్ట్ 316 అవార్డు ను లయన్ పెసల శ్రీకాంత్ కి ప్రస్తుత మల్టిపుల్ చైర్మన్ దామర్ల శాంతి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మూడవ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎండార్స్ విజయ్ కుమార్ రాజు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎండార్స్ సుభాష్ బాబు, ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఏ వి ఆర్ ప్రసాద్, డిస్టిక్ గవర్నర్ మాఘం గౌతమ్, డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ యిల్లూరు గోపాలకృష్ణ,వీడిజి- 1 విరూపాక్ష,,నంద్యాల సేవా ప్రగతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు పత్తి గిరిబాబు, డిస్టిక్ చైర్మెన్ రవి ప్రకాష్, నంద్యాల లయన్స్ క్లబ్ నిజాముద్దీన్,కార్యదర్శి శిరిగిరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply