నంద్యాల జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధుల మంజూరు : ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Oplus_131072

నంద్యాల : జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శుక్రవారం అమరావతిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రూ.967 కోట్లతో నంద్యాల – యర్రగుంట్ల మధ్య రైల్వే లైన్ ఏర్పాటు,రూ.2.25 కోట్లతో కొనసాగుతున్న 3 పార్కుల అభివృద్ధి పనులు, రూ.39.89 కోట్లతో నంద్యాల – డోన్ మధ్య రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు,అమృత్ పథకం కింద 5047 కుళాయి కనెక్షన్లు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, నంద్యాల జిల్లా అభివృద్ధికి నిధుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐ టీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధన్యవాదములు చెప్పారు.

Share this